చనుబండలో తాగునీటి సమస్యకు చెక్.....
చనుబండలో తాగునీటి సమస్యకు చెక్.. రూ.3 లక్షల నిధులతో బోరు ఏర్పాటు
గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు టీడీపీ నాయకుల చొరవ.. అశోక్ నగర్లో ప్రారంభమైన పనులు
చనుబండ: గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో కీలక చర్యలు చేపట్టారు. చనుబండ గ్రామ తాగునీటి అవసరాల కోసం రూ.3 లక్షలు మంజూరు కాగా, ఆ నిధులతో గురువారం మధ్యాహ్నం వాటర్ ప్లాంట్ రోడ్డులోని అశోక్ నగర్లో బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు.
ఎండాకాలం సహా అన్ని కాలాల్లోనూ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ బోరు ఉపయోగపడుతుందని స్థానిక నాయకులు తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన నాయకులకు స్థానికులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాసరావు, చీదిరాల మారేశ్వరరావు, నక్కా రాము, శ్రీను, శెట్టి నాగరాజు, అబ్బుతరావు, బొట్టు దుర్గారావు, మిద్దె చెన్నారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య పాల్గొన్నారు.