BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

చనుబండలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 07:20 PM
72 వీక్షణలు

చనుబండలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మోరంపూడి 

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి శాఖా గ్రంథాలయాధికారి శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారని తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు సమ్మర్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే పాఠ్యపుస్తకాలతో పాటు వ్యక్తిగత ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవడం అవసరమని చెప్పారు. ఈ శిబిరం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందని, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని వివరించారు.

మంచి పుస్తకం మన ఆలోచనలను మార్చి, జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలదని పేర్కొంటూ, గ్రంథాలయాలను విస్తృతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, మిద్దె చెన్నారావు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.