BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

చుక్కల భూములకు విముక్తి.. 10-15 రోజుల్లో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 06:06 PM
30 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో చుక్కల భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మరో 10 నుంచి 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

రెవెన్యూ రికార్డుల్లో యజమాని వివరాల స్థానంలో చుక్కలు నమోదు చేయబడిన భూములను చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ భూములు ప్రభుత్వానివా, వ్యక్తిగత యాజమాన్యానికి చెందినవా అన్న స్పష్టత లేకపోవడంతో వివాదాస్పద భూములుగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో వేలాది మంది భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూములు, రిజిస్ట్రేషన్లు, రీసర్వేకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు.

రీసర్వే 2.0 కార్యక్రమం ద్వారా భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని, ఇప్పటికే 1.33 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములకు విముక్తి కల్పించామని తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని, 22ఏ అంశంపై గతంలో జారీ చేసిన మెమో కంటే మెరుగైన మార్గదర్శకాలు తీసుకురానున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రీసర్వేపై రాష్ట్రవ్యాప్తంగా 7.5 లక్షల ఫిర్యాదులు అందాయని మంత్రి వెల్లడించారు. అందుకే రీసర్వే అనంతరం భూహక్కుదారుల ఈ-కేవైసీ తీసుకుని రాజముద్ర, ఫోటో, ఖాతా నంబర్, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని తెలిపారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చామని, గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసే అధికారాలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని స్పష్టం చేసిన మంత్రి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమలకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.