BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
19 Sep, 2026 - 06:52 PM
8 వీక్షణలు

వరంగల్: వరంగల్ విమానాశ్రయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్ అంశాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.295 కోట్లు చెల్లించిందని సీఎం పేర్కొన్నారు. సేకరించిన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించినట్లు వెల్లడించారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్ కేవలం విమాన రాకపోకలకు పరిమితం కాకుండా పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు గేట్‌వేగా మారే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా కోరారు. విమానాశ్రయానికి డిసెంబర్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.