www.ntodaynews.com
దేవరపల్లిలో 12 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఆంధ్రప్రదేశ్
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐసర్ వ్యాన్లో సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఏలూరు నుంచి కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు, వ్యాన్ను ఆపి తనిఖీ చేశారు. అనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యాన్ను సీజ్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.