BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి తిరువూరులో వైసీపీ రెండో రోజు నిరాహార దీక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
21 వీక్షణలు

తిరువూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరువూరులో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు కొనసాగాయి.

తిరువూరులో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వైసీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.

నిరుద్యోగులు, అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

దీక్ష శిబిరానికి తిరువూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మద్దతు తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై తమ ఆందోళనను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.