దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ..
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే గ్రామాల్లో సందడి నెలకొని పండుగ వాతావరణం ఏర్పడింది.
శుక్రవారం ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పింఛన్లు అందుకున్న వృద్ధులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు
నియోజకవర్గ వ్యాప్తంగా నేడు 35 వేల మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు రూ.15 కోట్ల 62 లక్షల 70 వేల రూపాయలు విడుదలైనట్లు సమాచారం
ప్రతి గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగుతోంది
దెందులూరు నియోజకవర్గం అంతటా ప్రజల హర్షధ్వానాల మధ్య కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది