www.ntodaynews.com
డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం
ఏలూరు జిల్లా డిపిర్టియూ కార్యనిర్వాహక అధ్యక్షునిగా చాట్రాయి మండలం చీపురుగూడెంలో పనిచేస్తున్న సత్తెనపల్లి రాము నియమితులయ్యారు. ఈ సందర్భంగా డిపిర్టియూ రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరావు, చాట్రాయి మండల డిపిర్టియూ శాఖ సభ్యులు రామును అభినందించారు.
సంఘ బలోపేతానికి కృషి చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు. రాము నియామకంతో జిల్లా స్థాయిలో సంఘ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.