BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Apr, 2026 - 08:45 AM
60 వీక్షణలు

దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి --సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ డిమాండ్

సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండల కేంద్రంలోని 6వ,7వ దళిత బిసి వార్డులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలు సిసి రోడ్లు నిర్మాణం చేసి మోరీలను మరిచిన ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు అని అన్నారు ప్రతి ఇంటి నుండి వేస్టేజ్ నీరు రోడ్లపైకి రావడం తోటి ఒంపుగా ఉన్న ఇండ్లలోకి నీరు వచ్చి చేరడం తోటి ఈ కాలనీ ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారని దీనివలన సీజనల్ అంటువ్యాధు లు వచ్చే ప్రమాదం ఉందని పైన ఉన్న ఇరువురు ఇండ్ల వారితో దిగువన ఉన్న ఇండ్లవారు రోజు మాటల యుద్ధమే జరుగుతుందని మాది దళితవాడ అయినందునే మమ్ముల పట్టించుకునే ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు కరువయ్యారని గతంలో ఎన్నిసార్లు ఎమ్మార్వోకి,ఎంపీడీవోకి, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశామని తమ బాధను వెలిబుచ్చుకున్నారని అన్నారు వెంటనే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి కాలనీ ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, గడ్డమీది నరసింహ, ఆవుల కలమ్మ, నాయకులు బిచ్చాల సంతోష్, ఆవుల మహేష్, తలారి భాను, కాలనీవాసులు అంజమ్మ, భారతమ్మ, లక్ష్మి, జయమ్మ, నరసమ్మ, మాధవి, సుగుణమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు