దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి
దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి --సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ డిమాండ్
సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండల కేంద్రంలోని 6వ,7వ దళిత బిసి వార్డులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలు సిసి రోడ్లు నిర్మాణం చేసి మోరీలను మరిచిన ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు అని అన్నారు ప్రతి ఇంటి నుండి వేస్టేజ్ నీరు రోడ్లపైకి రావడం తోటి ఒంపుగా ఉన్న ఇండ్లలోకి నీరు వచ్చి చేరడం తోటి ఈ కాలనీ ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారని దీనివలన సీజనల్ అంటువ్యాధు లు వచ్చే ప్రమాదం ఉందని పైన ఉన్న ఇరువురు ఇండ్ల వారితో దిగువన ఉన్న ఇండ్లవారు రోజు మాటల యుద్ధమే జరుగుతుందని మాది దళితవాడ అయినందునే మమ్ముల పట్టించుకునే ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు కరువయ్యారని గతంలో ఎన్నిసార్లు ఎమ్మార్వోకి,ఎంపీడీవోకి, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశామని తమ బాధను వెలిబుచ్చుకున్నారని అన్నారు వెంటనే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి కాలనీ ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, గడ్డమీది నరసింహ, ఆవుల కలమ్మ, నాయకులు బిచ్చాల సంతోష్, ఆవుల మహేష్, తలారి భాను, కాలనీవాసులు అంజమ్మ, భారతమ్మ, లక్ష్మి, జయమ్మ, నరసమ్మ, మాధవి, సుగుణమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు