www.ntodaynews.com
దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలో మల్లేష్ మృతదేహం లభ్యం
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలో మల్లేష్ మృతదేహం లభ్యం
జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ (40) మృతదేహం శనివారం దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి నది తీరంలో లభ్యమైంది. ఈ నెల 16న తిమ్మాపూర్ రామాలయం వద్ద నుంచి అదృశ్యమైన మల్లేష్ కోసం పోలీసులు వెతుకుతుండగా, నది తీరంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న దండేపల్లి ఎస్సై తహసోద్దీన్ మృతదేహాన్ని పరిశీలించగా, కుటుంబ సభ్యులు అది మల్లేష్దేనని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై పలు కోణాల్లో పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు