BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

మందగించిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణ
/ హైదరాబాద్
11 Jun, 2026 - 07:26 AM
205 వీక్షణలు

రాబోయే రోజుల్లో పెరగనున్న ఎండలు, ఉక్కపోత

​తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు కొంత మందగించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇవి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే విస్తరించి నిలిచిపోయాయి. రుతుపవనాల కదలికలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రాబోయే రోజుల్లో ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 18 తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి, కాస్త చల్లబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ 19 నుండి 23 మధ్య తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుని, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం  రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది.