BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

మోడీ పాలనపై సిపిఐ(ఎం ఎల్) లిబరేషన్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 10:18 AM
146 వీక్షణలు

కేంద్రంలో 12వ సంవత్సరం పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ పాలనను ఘనంగా జరుపుకునే ఎన్డీ ఏ సమ్మేళనానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి రాష్ట్ర రాజకీయాల్లో ఓ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మేలు చేయడం శూన్యమని సిపిఐ(ఎం ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిహరినాథ్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు వాగ్దానాలు, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన హామీలు సగం కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. మోడీ పాలనలో పబ్లిక్ రంగ సంస్థలు–ఎల్ఐసి, రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌పోర్టులు, ఎఫ్‌సిఐ–విక్రయానికి పెట్టబడడం, అలాగే ఆదానీ, అంబానీలకు అవకాశాలు సమకూర్చడం వల్ల నిరుద్యోగం పెరిగినట్లు విమర్శించారు. రూపాయి విలువ డాలర్‌ లో 96 పైసల వరకు పతనం చెందినందుకు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

చాయ్‌ వాలా పాలనలో పకోడీలు అమ్మే వ్యక్తి కూడా తాను కల్పించిన ఉద్యోగమే అని పేర్కొన్న మోడీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల చిన్న హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని,ఇది ఆయన అభివృద్ధి మానిఫెస్టోకు వ్యతిరేకమే.”అని

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో మోడీ గిన్నిస్ రికార్డులు సృష్టించారని, ప్రతిపక్షాలపై ఐ టి దాడులు చేసి భయపెట్టడం, లోపరచుకోవడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతోందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యంతో నితీష్ కుమార్‌ను కేంద్రానికి పంపి, చంద్రబాబును రాష్ట్రంలో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని డీహరినాధ్ ఆవేదన వ్యక్తం చేశారు 

మోడీ–అమెరికా వాణిజ్య ఒప్పందం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, NEET పరీక్షల లీక్‌ పరిస్థితి వల్ల 26 లక్షల మంది విద్యార్థులు కష్టపడ్డారని తెలిపారు. అలాగే, కాక్రోచ్ జంతర్ మంతర్‌లో నిరుద్యోగ యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన మోడీ పాలనపై ప్రజల అసంతృప్తిని సూచిస్తుందని డి హరినాథ్ గుర్తు చేశారు.

డీహరినాథ్ చివరగా హెచ్చరిస్తూ, “ప్రజల స్పందనకు మోడీ తన శ్రేణులను అప్రమత్తంగా వుంచకపోతే ఎదురుదెబ్బలు తప్పవు” అని హెచ్చరించారు