మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం...
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని కొత్త బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న జగనన్న ప్లాట్ల ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
మృతుడిని చల్ల భూదేవయ్య (50) గా గుర్తించారు. వడ్డెర కులానికి చెందిన భూదేవయ్య లారీ క్లీనర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు దూరంగా ఉండగా, అప్పుడప్పుడు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు, బైపాస్ రోడ్డుకు సమీపంలోని ఓ జామ తోటలో భూదేవయ్య గతంలో సుమారు మూడు నెలల పాటు వాచ్మెన్గా పనిచేశాడు. మద్యం సేవించే అలవాటు అధికంగా ఉండటంతో యజమాని అతడిని విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇటీవల మళ్లీ పనిలో చేర్చుకోవాలని కోరినా యజమాని నిరాకరించినట్లు