డ్రగ్స్కు దూరంగా ఉండండి.. జీవితాన్ని ప్రేమించండి: విసన్నపేటలో అవగాహన ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో శుక్రవారం "నిషా ముక్తి భారత్" కార్యక్రమంలో భాగంగా "డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు" అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారి విసన్నపేట మండల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విసన్నపేట ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విసన్నపేట తహసీల్దార్, ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. "డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు", "మాదకద్రవ్యాలకు నో చెప్పండి" అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.