www.ntodaynews.com
డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్
అమరావతి: డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలపై జూలై నెల నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే రూ.5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. దీంతో మహిళా సంఘాలపై రుణభారం కొంత మేర తగ్గనుంది.
అయితే రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో ప్రస్తుతం 2.5 శాతం వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో డ్వాక్రా మహిళలకు రుణాల భారం తగ్గి, ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుంది.