ద్వారకాతిరుమల లాడ్జిలో పేకాట గుట్టు రట్టు.. 10 మంది అరెస్ట్
జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. భీమడోలు సీఐ కృష్ణ నేతృత్వంలో బుధవారం రాత్రి ఈ తనిఖీలు నిర్వహించగా పేకాట ఆడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఇద్దరు దేవస్థానం ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ టి. సుధీర్ ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ పేకాట శిబిరం వెనుక ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పోలీస్ శాఖ అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.