BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

తెలంగాణ
04 Feb, 2026 - 10:31 AM
232 వీక్షణలు
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం చిట్యాల 11వ వార్డులో సందీప రామ్ రెడ్డి ముమ్మర ప్రచారం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శివాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. అదే విధంగా చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 11వ వార్డులో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. నాయకుడిగా కాకుండా ప్రజల మధ్య ఉండే సేవకుడిగా పనిచేస్తూ, ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఇతర పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. #Chityal #MunicipalElections #CongressParty #ElectionCampaign #UrbanDevelopment #LocalGovernance #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube