ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి
- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు
- సమీకృత కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అన్నారు. గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్)లోని తన ఛాంబర్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి ఆయన ఎస్.డబ్ల్యూ.సి. (SWC) నిర్వాహకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశిత గడువులోగా జిల్లాలో ధాన్యం ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో సి ఎస్ సి, ఎ సి ఎస్ ఓ, డి సి ఓ, డి పి ఎం లతో పాటు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు