BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

​ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 09:16 PM
179 వీక్షణలు

​ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి

  • ​జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు
  • ​సమీకృత కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అన్నారు. గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్)లోని తన ఛాంబర్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి ఆయన ఎస్.డబ్ల్యూ.సి. (SWC) నిర్వాహకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశిత గడువులోగా జిల్లాలో ధాన్యం ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

​ఈ సమీక్షా సమావేశంలో సి ఎస్ సి, ఎ సి ఎస్ ఓ, డి సి ఓ, డి పి ఎం లతో పాటు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు