ధర్వేశిపురం తొలి బోనాల కరపత్రావిష్కరణ
ధర్వేశిపురం తొలి బోనాల కరపత్రావిష్కరణ
శ్రావణ మాసం సందర్భంగా నల్లగొండ జిల్లా ధర్వేశిపురం సదాశివ ఫంక్షన్ హాల్లో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కుమ్మరుల ఆధ్వర్యంలో ఈ నెల 16న 201 బోనాలు సమర్పించనున్నట్లు కుమ్మర సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం చిట్యాలలో మండల అధ్యక్షుడు పాకాల దినేష్, మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ బోనాల జాతర మహోత్సవానికి సుమారు 3,000 మందికి పైగా కుమ్మరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవ నాగరికతకు కుమ్మరి తొలి మెట్టు అని, కుండ ప్రతీ ఒక్కరి ఆయువు పట్టు అని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీను, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ ఎగిరిశెట్టి అనిత, జిల్లా కమిటీ సభ్యులు తాడూరి చంద్రం, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి ఆర్రూరి నరసింహ, ఉపాధ్యక్షులు ఆర్రూరి శ్రీను, ఏరుకొండ నర్సింహ, పాకాల వెంకన్న, పాకాల సత్యనారాయణ, సిరిసినవాడ వెంకన్న, ఖమ్మంపాటి నర్సింహ, బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, ఖమ్మంపాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.