www.ntodaynews.com
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
తెలంగాణ
లోత్తునూర్ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సంక్షేమ శాఖ చొరవతో గ్రామానికి చెందిన నలుగురు నిరుపేదలకు మొత్తం రూ.1,41,500 విలువైన సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఊరట కల్పిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒరగంటి మల్లేష్తో పాటు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్కం శ్రీకాంత్, గోనే ఆశన్న, ఒరగంటి జాను, బోనాల రాజు, కాళ్ళ రమేష్, మనోహర్, మహేష్, కాళ్ళ రాజు, రాకేష్ తదితరులు హాజరయ్యారు.
#Ntodaynews #CMRF #PublicWelfare #Lothoonur #Gollapalli #JagtialDistrict #Telangana #GovernmentSchemes #SocialSecurity
Follow us on
Website
Facebook
Instagram
YouTube