www.ntodaynews.com
తొర్రూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
తెలంగాణ
తొర్రూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్ వేణు
87 మందికి రూ. 43.50 లక్షల ఆర్థిక సహాయం
తొర్రూరు: పట్టణ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలు మరియు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులకు చెందిన మొత్తం 87 మంది లబ్ధిదారులకు కలిపి రూ. 43,50,000 విలువైన సహాయాన్ని పంపిణీ చేశారు. అనారోగ్య చికిత్సలు, ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అవసర సమయంలో ప్రతి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలవకుండా ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. అర్హులైన వారికి పారదర్శకంగా, వేగంగా సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
లబ్ధిదారులు అందిన ఆర్థిక సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని, పట్టణ అధ్యక్షుడు సోమా రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#Palakurthi #Thorrur #CMReliefFund #WelfareScheme #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube