www.ntodaynews.com
రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు పంపిణీ.
తెలంగాణ
రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వరి విత్తనాలు పంపిణీ.
NTODAY NEWS రిపోర్టర్ (వీరమల్ల శ్రీను)
17/6/2025 మంగళవారం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద పంచాయతీలోని వరి రైతులకు వరి 1064,BPT 5204,MTU1064,MTU 1121, రకాల విత్తనాల సబ్సిడీ పై పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పంచాయతీలోని రాచన్నగూడెం, తాటి రామన్నగూడెం, గోపాలపురం, లంకలపల్లి, జిల్లెలు గూడెం, గ్రామాలలో సుమారుగా 122 మంది రైతులకు 37 క్వింటాల విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమం రాచన్నగూడెం పంచాయితీ ప్రెసిడెంట్ సున్నం వరలక్ష్మి, ఎంపీటీసీ పుసం ఉదయ్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకుల, సచివాలయ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాచన్నగూడెం టిడిపి పార్టీ ప్రెసిడెంట్ పులుమోలు శివాజీ, మండల తెలుగు యువత సెక్రటరీ పేరు బోయిన దాము, బరగడ రాజు, తోట పండు,రాచన్నగూడెం పంచాయితీ జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బోడపాటి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కొప్పులు కార్తీక్, సెక్రటరీ గొడుగులు కిరణ్, వీరమల్ల శ్రీను, కుంజ రమేష్, తాటి లక్ష్మణ్, సంకురు, కారక ముత్యాలరావు, మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube