BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:40 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

త్యాగరాజ స్వామి వినాయక భక్తి మండలిని సందర్శించిన జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
19 Sep, 2026 - 06:40 PM
11 వీక్షణలు

కదిరి: శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వినాయక భక్తి మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరి పట్టణంలోని 26వ వార్డు త్యాగరాజు వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కదిరి డీఎస్పీ వీరనారాయణ, అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సందర్శించారు.

ఈ సందర్భంగా అధికారులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

30 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్న శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వినాయక భక్తి మండలి సభ్యులను అధికారులు అభినందించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.

అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డీఎస్పీ వీరనారాయణలను మండలి సభ్యులు దృశ్యాలవలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలి సభ్యులు, అధికారులు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.

కార్యక్రమంలో శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వినాయక భక్తి మండలి కమిటీ అధ్యక్షుడు రోడ్డార్పు హరిప్రసాద్‌తో పాటు లోకేష్, శివ, జగదీష్, వీర విఘ్నేష్, మునిరత్నం, పవన్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండలి సభ్యులు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా త్యాగరాజ స్వామి వినాయక భక్తి మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.