BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు

తెలంగాణ
23 Jan, 2026 - 08:38 AM
148 వీక్షణలు
గొల్లపల్లిలో వైభవంగా శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పనులు శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భూమి పూజ, పునాది పనులు పూర్తికాగా, వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ గోడల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస శుద్ధ పంచమి తిథిని పురస్కరించుకుని ఉదయం 10:25 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 ఇటుకలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి గోడల నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ్ పాల్గొనడం గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇటుకలను ఉంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరగడం శుభసూచకమని, లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. భక్తుల కోలాహలం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube