BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు

తెలంగాణ
23 Jan, 2026 - 08:38 AM
237 వీక్షణలు
గొల్లపల్లిలో వైభవంగా శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పనులు శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భూమి పూజ, పునాది పనులు పూర్తికాగా, వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ గోడల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస శుద్ధ పంచమి తిథిని పురస్కరించుకుని ఉదయం 10:25 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 ఇటుకలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి గోడల నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ్ పాల్గొనడం గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇటుకలను ఉంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరగడం శుభసూచకమని, లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. భక్తుల కోలాహలం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube