BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు

తెలంగాణ
23 Jan, 2026 - 08:38 AM
177 వీక్షణలు
గొల్లపల్లిలో వైభవంగా శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పనులు శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భూమి పూజ, పునాది పనులు పూర్తికాగా, వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ గోడల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస శుద్ధ పంచమి తిథిని పురస్కరించుకుని ఉదయం 10:25 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 ఇటుకలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి గోడల నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ్ పాల్గొనడం గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇటుకలను ఉంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరగడం శుభసూచకమని, లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. భక్తుల కోలాహలం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube