ఈ నెల 15 నుంచి సింగరేణిలో TRS బాయి బాట
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక 'బాయిబాట' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆమె ఐదు ప్రధాన సింగరేణి ప్రాంతాలను సందర్శించి, అక్కడి కార్మికులతో నేరుగా భేటీ కానున్నారు.
పర్యటన పూర్తి వివరాలు:
జూన్ 15: చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో పర్యటన ప్రారంభం.
జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రాంతంలో పర్యటన.
జూన్ 17, 18: రామగుండం ప్రాంతంలో రెండు రోజుల పాటు విస్తృత పర్యటన.
జూన్ 19: మంథని ప్రాంతంలో పర్యటన.
జూన్ 20: భూపాలపల్లి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ సింగరేణి మైనింగ్ ఏరియాల సందర్శనతో పర్యటన ముగింపు.
ఈ ఆరు రోజుల పర్యటనలో కవిత గారు సింగరేణి కార్మికులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు