www.ntodaynews.com
ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య మృతి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
NTODAY NEWS రామసముద్రం చెక్పోస్ట్లో విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) ఆదివారం అస్వస్థతతో మృతి చెందారు. డ్యూటీలో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను సహచర సిబ్బంది మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర ఈ విషయాన్ని ధృవీకరించారు. రెడ్డయ్య మృతదేహానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.