www.ntodaynews.com
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే
తెలంగాణ
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే
NTODAY NEWS: ఏలూరు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారికి భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు వచ్చిన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ముగ్గురు విద్యార్ధినీలు చదువు అవసరం నిమిత్తం ల్యాప్ టాప్ లు అడిగారు. మరియు చిరు వ్యాపారులు ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లు అందజేయాలని కోరారు. వారి సమస్యను విన్న ఎమ్మెల్యే శుక్రువారం నాడు తన క్యాంపు కార్యాలయంలో ముగ్గురు విధ్యార్ధినిలకు ల్యాప్ టాప్ లు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సహాయం చేయడం ద్వారా వారు అభ్యున్నతి చెందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube