www.ntodaynews.com
రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం
తెలంగాణ
/
మంచిర్యాల
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం
మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం సోమవారం లక్షెట్టిపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ దిలీప్ మరియు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాందేని వెంకటేష్, శివకుమార్, కూకట్ల మహేష్, మెక్మా టిఎంసి శంకర్ తో పాటు హమాలీలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని, రైతులంతా ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.