BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ ఒక మహా యజ్ఞంలా కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 08:17 AM
108 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ ఒక మహా యజ్ఞంలా కొనసాగుతుంది బూరుగుగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు కొత్త దశలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా కొనసాగుతూ, గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ప్రతి అర్హుడి ఇంటికే సంక్షేమం చేరుతోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పానుగంటి కేశవరావు తదితరులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై నాయకులను అభినందిస్తూ, పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పేదలు ఇప్పుడు గౌరవంతో పింఛన్లు పొందుతున్నారని, ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తోందని అన్నారు. కార్యక్రమం మొత్తం హర్షాతిరేక వాతావరణంలో సాగుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరిచింది.