ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం
ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం – పోలాసిగూడెంలో ఎమ్మెల్యే పర్యటన హైలైట్
కామవరపుకోట మండలం పోలాసిగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని, అర్హులైన పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. “ప్రతి ఇంటికీ భరోసా… ప్రతి మనిషికి ఆదరణ” అనే ధోరణిలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.