BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 11:57 AM
127 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం – పోలాసిగూడెంలో ఎమ్మెల్యే పర్యటన హైలైట్

కామవరపుకోట మండలం పోలాసిగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని, అర్హులైన పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్‌లు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. “ప్రతి ఇంటికీ భరోసా… ప్రతి మనిషికి ఆదరణ” అనే ధోరణిలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.