BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 06:57 PM
98 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి లో నరసాపురం-చాట్రాయి మధ్య ఆర్ & బి ప్రధాన రహదారి నాలుగు ఐదు చోట్ల భారీ వాహనాలు నడవడంతో రోడ్డు కృంగి పోయింది. భూమిలోనికి కృంగిపోయిన రోడ్డు వలన వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కార్లు బాడీ క్రింద రోడ్డు తగిలే పరిస్థితి నెలకొంది. గత నాలుగైదు నెలల నుండి ఈ పరిస్థితి కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విస్సన్నపేట నుంచి చింతలపూడి మధ్య ప్రధాన రహదారి గుట్ట ప్రాంతం వలన నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనికి తగిన మరమ్మత్తులు చేయకపోవడం వలన వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు జరగటానికి అవకాశం అధికంగా ఉంటుంది. వాహనదారులు ఎప్పుడైనా ప్రాణనష్టం జరగడం కాకుండా ముందే ఆర్ & బి అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితి అనుభవిస్తున్న వాహనదారులు "ప్రాణాలు పోయే పరిస్థితిలో మార్పులు తీసుకురావడం ఎంతమాట?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు వాహనదారులు, "సరిగ్గా దృష్టిని పెట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే అనుకోకుండా ప్రాణహాని సంభవించవచ్చు," అని హెచ్చరించారు.

ఈ రహదారిని తిరిగి సురక్షితంగా మారుస్తే ప్రమాదాలు తగ్గి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతుంది.