BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 19 April 2026, 06:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 06:57 PM
178 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి లో నరసాపురం-చాట్రాయి మధ్య ఆర్ & బి ప్రధాన రహదారి నాలుగు ఐదు చోట్ల భారీ వాహనాలు నడవడంతో రోడ్డు కృంగి పోయింది. భూమిలోనికి కృంగిపోయిన రోడ్డు వలన వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కార్లు బాడీ క్రింద రోడ్డు తగిలే పరిస్థితి నెలకొంది. గత నాలుగైదు నెలల నుండి ఈ పరిస్థితి కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విస్సన్నపేట నుంచి చింతలపూడి మధ్య ప్రధాన రహదారి గుట్ట ప్రాంతం వలన నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనికి తగిన మరమ్మత్తులు చేయకపోవడం వలన వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు జరగటానికి అవకాశం అధికంగా ఉంటుంది. వాహనదారులు ఎప్పుడైనా ప్రాణనష్టం జరగడం కాకుండా ముందే ఆర్ & బి అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితి అనుభవిస్తున్న వాహనదారులు "ప్రాణాలు పోయే పరిస్థితిలో మార్పులు తీసుకురావడం ఎంతమాట?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు వాహనదారులు, "సరిగ్గా దృష్టిని పెట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే అనుకోకుండా ప్రాణహాని సంభవించవచ్చు," అని హెచ్చరించారు.

ఈ రహదారిని తిరిగి సురక్షితంగా మారుస్తే ప్రమాదాలు తగ్గి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతుంది.