www.ntodaynews.com
స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
రెవెన్యూ డివిజనల్ అధికారి, తిరువూరు వారు తెలియజేసినట్లు, శ్రీయుత కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా వారు రేపు తేదీ 19-06-2026 (శుక్రవారం) ఉదయం 10.00 గంటలకు గంపలగూడెం మండలం, పెద కొమిర గ్రామంలోని ఎస్.ఆర్. కల్యాణ మండపంలో ప్రత్యేకంగా “స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు మరియు మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు.
కావున పెద కొమిర గ్రామ ప్రజలు మరియు తిరువూరు నియోజకవర్గ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై, తమ సమస్యలు ఉన్న పక్షంలో అర్జీ రూపంలో సమర్పించాలని కోరడమైనది.
అలాగే మీడియా మిత్రులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరడమైనది.