BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 18 April 2026, 08:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పడమరమాధవరం-1 ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 08:55 PM
184 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం - పడమరమాధవరం-1 ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు మండలంలో ఉన్న పడమరమాధవరం-1 ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఇంజన్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. 254 లక్షల రూపాయల వ్యయంతో టీఎస్పీ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పథకం, 656 ఎకరాలకు సాగునీరు అందించడంతో రైతుల జీవనోపాధికి ఎంతో మేలైంది. ఈ పథకంతో, వలసలను నివారించేందుకు కీలకమైన ఒక పథకం గా మారింది.

కానీ, ఈ పథకం ఇప్పుడు నిర్వహణలో సాంకేతిక, భద్రతా లోపాల కారణంగా పూర్తిగా నిలిచిపోయింది. చోరీ జరిగిన తర్వాత, ఇంజన్లు, ట్రాన్స్ఫార్మర్లను తిరిగి పొందడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సీసీ కెమెరాలు లేకపోవడం, నైట్ వాచ్మెన్ లేకపోవడం వంటి భద్రతా ఏర్పాట్ల లోపం దొంగలకు సులభంగా మార్గం దొరకటానికి కారణమైంది.

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు, అఖిలభారత కిసాన్ మహాసభ నేతలు, రైతులతో కలిసి పథక ప్రాంతాన్ని సందర్శించి, ఈ విషయం పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ, పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నుండి తక్షణమే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక, భవిష్యత్తులో ఇలాంటి చోరీలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వం స్పందించకుంటే, రైతులు, స్థానిక ప్రజలు ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ పథకం రైతుల జీవనోపాధి కోసం ఎంతో కీలకమైనది, కాబట్టి దాన్ని పునరుద్ధరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత అన్యాయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు