BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఎస్‌ఐఆర్ నోటీసులపై ఆందోళన వద్దు.. కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:02 AM
16 వీక్షణలు

ఎస్‌ఐఆర్ నోటీసులపై ఆందోళన వద్దు.. కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం

ఓటు హక్కు తొలగించినట్లు కాదు.. ఆధారాల ఆధారంగా పారదర్శక విచారణ

ఎన్టీఆర్ జిల్లా: ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) నోటీసులపై ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నోటీసు జారీ చేయడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి కేసును ఆధారాల పరిశీలనతో పారదర్శకంగా విచారించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.