ఎస్ఐఆర్ నోటీసులపై ఆందోళన వద్దు.. కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం
ఎస్ఐఆర్ నోటీసులపై ఆందోళన వద్దు.. కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం
ఓటు హక్కు తొలగించినట్లు కాదు.. ఆధారాల ఆధారంగా పారదర్శక విచారణ
ఎన్టీఆర్ జిల్లా: ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) నోటీసులపై ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నోటీసు జారీ చేయడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి కేసును ఆధారాల పరిశీలనతో పారదర్శకంగా విచారించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.