BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణ
10 Feb, 2026 - 09:46 AM
170 వీక్షణలు
చిట్యాలలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తిచేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 12,118 మంది ఓటర్లకు గాను 12 వార్డులుగా విభజించి 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో -24 మంది ప్రిసైడింగ్ అధికారులు -24 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు -72 మంది ఇతర ఎన్నికల సిబ్బంది ఉన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తి మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో మోడల్ (ఆదర్శ) పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రమేష్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అకస్మాత్తుగా తనిఖీ చేసి, ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లో 13 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా ఒక డీఎస్పీ పర్యవేక్షణలో -ఇద్దరు సీఐలు -8 మంది ఎస్ఐలు -75 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని సీఐ నాగరాజు తెలిపారు. పోలింగ్ సామాగ్రిని సురక్షితంగా కేంద్రాలకు చేర్చామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. #MunicipalElections #Chityala #PollingDay #ElectionPreparedness #ModelPollingStation #PoliceSecurity #Democracy #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube