www.ntodaynews.com
ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు
తెలంగాణ
ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు
NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామానికి చెందిన పిట్ట మోహన్ ఇటీవల 15/08/2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సారపాక ఐటిసి కంపెనీలో 15 వేల జామాయిల్ ట్రైన్ మొక్క నాలుగు రూపాయలకు చొప్పున 60 వేల రూపాయలుకు డిడి రూపంలో సొమ్ము చెల్లించి మొక్కతీసుకోవడం జరిగింది. కనీసం నాలుగు రోజులుకే మొక్క నాటకుండా ట్రైలలోని తెగులు సోగి చనిపోవడంతో మొక్క అనేది వ్యాధికీ గురి కావడం వల్ల నాసిరకం మొక్క పంపిణీ జరిగిందని ఐటిసి కంపెనీ సూపర్వైజర్ నాగరాజు, మేనేజర్ సాయి తేజ అధికారులను ప్రశ్నించగా మొక్కలు తిరిగి ఇవ్వడం జరగదు అని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఐటీసీ పేరిట అధికారులు వ్యక్తిగత స్వలాభం కోసం ప్రైవేట్ నర్సరీల నుంచి నాసీ రకం ఒక్క మొక్క రెండు రూపాయలకే కొనుగోలు చేసి ఐటీసీ కంపెనీ ముసుగులో నాలుగు రూపాయలకు రైతులకు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారని, తమకు ఇచ్చిన మొక్కలు కూడా ఐటీసీ కంపెనీ కాకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి ట్యాగ్స్ లేని మొక్కలను ఇచ్చారని ఇది ఒక చీకటి వ్యాపారంగా కొనసాగిస్తున్నారని రైతు వాపోతున్నారు. అధికారుల మోసాల వల్ల రైతుల నష్టపోతున్నారని గతంలో కూడా ఇలాంటివి జరిగాయని మొక్క ఇచ్చిన ట్రైలను తిరిగి ఇవ్వగా ట్రైలకి వచ్చే డబ్బులు అధికారులు తిరిగి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ మరలా ఇలాంటివి జరగకుండా అధికారులకు తగిన గుణపాఠం చెప్పాలని రైతుల కోరుతున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube