BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

యూరియా కొరతపై రైతుల ఆందోళన

తెలంగాణ
21 Feb, 2026 - 11:11 AM
341 వీక్షణలు
యూరియా కొరతపై రైతుల ఆందోళన సహకార సంఘం గేటుకు తాళం వేసి నిరసన NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయం ఎదుట రైతులు యూరియా కొరతపై శుక్రవారం ఆందోళన చేపట్టారు. సంఘం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. పిట్టంపల్లి, పేరపల్లి, సుంకనపల్లి తదితర గ్రామాల రైతులు ఈ కేంద్రం ద్వారా యూరియా పొందుతున్నారు. శుక్రవారం రాత్రి కేంద్రానికి 560 బస్తాల యూరియా చేరిందనే సమాచారం రావడంతో ఉదయం నుంచే రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ ‘నో స్టాక్’గా చూపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో కూడా యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలకు ఎరువులు వేయలేకపోయామని మహిళా రైతు పేర్కొన్నారు. 560 బస్తాలు వచ్చాయని సమాచారం అందడంతో ఆన్లైన్ బుకింగ్ ప్రయత్నించినా, ఉదయం 9.30లోపే ‘నో స్టాక్’గా చూపించిందని రైతులు తెలిపారు. యూరియా బుకింగ్ కోసం అమలు చేస్తున్న యాప్ విధానం ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపించారు. చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. యాప్ విధానాన్ని రద్దు చేసి, టోకెన్ విధానం ద్వారా ప్రత్యక్షంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రానికి వచ్చిన 560 బస్తాలను ఎవరికి, ఎంతమేర పంపిణీ చేశారో వివరాలు వెల్లడించాలని కోరారు. పంటల సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తోందని రైతులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. #Chityal #Nalgonda #UreaShortage #FarmersProtest #AgricultureNews Follow us on Website Facebook Instagram YouTube