BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

యూరియా కొరతపై రైతుల ఆందోళన

తెలంగాణ
21 Feb, 2026 - 11:11 AM
285 వీక్షణలు
యూరియా కొరతపై రైతుల ఆందోళన సహకార సంఘం గేటుకు తాళం వేసి నిరసన NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయం ఎదుట రైతులు యూరియా కొరతపై శుక్రవారం ఆందోళన చేపట్టారు. సంఘం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. పిట్టంపల్లి, పేరపల్లి, సుంకనపల్లి తదితర గ్రామాల రైతులు ఈ కేంద్రం ద్వారా యూరియా పొందుతున్నారు. శుక్రవారం రాత్రి కేంద్రానికి 560 బస్తాల యూరియా చేరిందనే సమాచారం రావడంతో ఉదయం నుంచే రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ ‘నో స్టాక్’గా చూపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో కూడా యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలకు ఎరువులు వేయలేకపోయామని మహిళా రైతు పేర్కొన్నారు. 560 బస్తాలు వచ్చాయని సమాచారం అందడంతో ఆన్లైన్ బుకింగ్ ప్రయత్నించినా, ఉదయం 9.30లోపే ‘నో స్టాక్’గా చూపించిందని రైతులు తెలిపారు. యూరియా బుకింగ్ కోసం అమలు చేస్తున్న యాప్ విధానం ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపించారు. చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. యాప్ విధానాన్ని రద్దు చేసి, టోకెన్ విధానం ద్వారా ప్రత్యక్షంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రానికి వచ్చిన 560 బస్తాలను ఎవరికి, ఎంతమేర పంపిణీ చేశారో వివరాలు వెల్లడించాలని కోరారు. పంటల సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తోందని రైతులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. #Chityal #Nalgonda #UreaShortage #FarmersProtest #AgricultureNews Follow us on Website Facebook Instagram YouTube