www.ntodaynews.com
విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
తెలంగాణ
వట్టిమర్తి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నర్ర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, అందులో కళ్ల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించి సత్వర చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షల అనంతరం అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు యాదయ్య, ఉపాధ్యాయులు మౌనిక, చంద్రయ్య, నరసింహ, అనిస్పాతి సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
#Chityal #Nalgonda #FreeEyeCamp #LVPrasadEyeInstitute #StudentHealth #TelanganaNews #PublicHealth
Follow us on
Website
Facebook
Instagram
YouTube