BREAKING
కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

వృద్ధులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు

తెలంగాణ
11 Jan, 2026 - 03:26 AM
218 వీక్షణలు

“పోలీసులు మీకోసం” కార్యక్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం

NTODAY NEWS: రామగుండం పోలీస్ కమిషనరేట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో “పోలీసులు మీకోసం” కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ శాఖ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేష్ నేతృత్వంలో గత నెల నీల్వాయి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి సమన్వయంతో నిర్వహించగా, మంచిర్యాల కంటి వైద్యుల బృందం వైద్య సేవలు అందించింది. ఈ శిబిరంలో సుమారు 200 మంది వృద్ధులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల పరీక్షల్లో 64 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించగా, ప్రత్యేక చొరవతో ఇప్పటివరకు మండలంలోని 40 మందికి మంచిర్యాల పట్టణంలోని పవన్ ఆప్టికల్స్‌లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. మిగిలిన అర్హులైన వృద్ధులకు కూడా త్వరలో కంటి శస్త్రచికిత్సలు కొనసాగించనున్నట్లు తెలిపారు. అలాగే, గత నెలలో నిర్వహించిన “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా మండలంలోని పేద, వృద్ధుల సహాయార్థం సుమారు 100 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు కేవలం లా అండ్ ఆర్డర్ పరిరక్షణకే పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా ముందుండి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. Follow us on Website Facebook Instagram YouTube