BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దౌర్జన్యం..

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:04 PM
20 వీక్షణలు

గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దౌర్జన్యం.. లారీ డ్రైవర్‌పై విచక్షణారహిత దాడి

షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఘటన.. రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ సమక్షంలోనే వీరంగం

విశాఖపట్నం జిల్లా గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురుసు ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీని ఆపలేదనే కారణంతో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్‌టేక్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలోనే ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి జరుగుతున్న సమయంలో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారని లారీ డ్రైవర్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై లారీ డ్రైవర్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

లారీ డ్రైవర్‌పై దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.