www.ntodaynews.com
గాంధీ నాటిన మేడిచెట్టు స్థానంలో మొలిచిన వేపచెట్టు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు: స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఓ మహావృక్షం స్థానంలో మరో చెట్టు గాంధీ జ్ఞాపకాలను కొనసాగిస్తోంది. 1921లో ఏలూరు పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీ నాటిన మేడిచెట్టు శతాబ్దానికి పైగా ప్రజలకు నీడనిచ్చి ఇటీవల ఎండిపోయింది.
అయితే ఆ చెట్టు ఉన్న ప్రదేశంలోనే సహజంగా ఓ వేప మొక్క మొలకెత్తి ప్రస్తుతం పెద్ద చెట్టుగా ఎదిగింది. గాంధీ నాటిన చెట్టు జ్ఞాపకాలను కొనసాగిస్తూ ఈ వేపచెట్టు విద్యార్థులకు నీడను అందిస్తోంది.
వేపచెట్టు కింద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెపై ప్రతిరోజూ సాయంత్ర వేళల్లో విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. చారిత్రక ప్రదేశంలో సహజంగా పెరిగిన ఈ వేపచెట్టు స్థానికులకు ఆకర్షణగా మారడంతో పాటు, గాంధీ స్మృతులను సజీవంగా నిలుపుతోంది.