BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

గంగాదేవిపల్లి రహదారి ప్రమాదాలకు నిలయం..! హెచ్చరిక బోర్డులు ఎక్కడ..?

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:38 PM
31 వీక్షణలు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని గంగాదేవిపల్లికి వెళ్లే తాడిపత్రి–గుత్తి ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇటీవల ఈ మార్గంలో వరుసగా నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత నేషనల్ హైవే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని వాహనదారులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యేకించి రాత్రి వేళల్లో రహదారిపై సరైన సూచికలు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.