BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

గంగాదేవిపల్లి రహదారి ప్రమాదాలకు నిలయం..! హెచ్చరిక బోర్డులు ఎక్కడ..?

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:38 PM
10 వీక్షణలు

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని గంగాదేవిపల్లికి వెళ్లే తాడిపత్రి–గుత్తి ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇటీవల ఈ మార్గంలో వరుసగా నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత నేషనల్ హైవే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని వాహనదారులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యేకించి రాత్రి వేళల్లో రహదారిపై సరైన సూచికలు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.