BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 May, 2026 - 03:04 PM
32 వీక్షణలు

​కమిషనరేట్ ఆదేశాలతో ముమ్మర సోదాలు

​జైపూర్ పరిధిలో రంగంలోకి స్పెషల్ వింగ్స్

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ పరిధిలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి మహమ్మారిని రూపుమాపడమే ధ్యేయంగా రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ వింగ్ ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి జైపూర్ పరిధిలోని కీలక ప్రాంతాలను జల్లెడ పట్టాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, హోటళ్లు, అనుమానాస్పదంగా ఉన్న పాన్ షాపుల్లో అణువణువూ ఆకస్మిక దాడులు నిర్వహించి క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు.


​సమాజానికి ముప్పుగా మారిన నిషేధిత వస్తువులు, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తును, ముఖ్యంగా యువతను మత్తు రక్కసి బారి నుండి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇటువంటి ఆకస్మిక తనిఖీలు రాబోయే రోజుల్లోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రజలు, యువత కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు