BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 03:04 PM
66 వీక్షణలు

​కమిషనరేట్ ఆదేశాలతో ముమ్మర సోదాలు

​జైపూర్ పరిధిలో రంగంలోకి స్పెషల్ వింగ్స్

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ పరిధిలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి మహమ్మారిని రూపుమాపడమే ధ్యేయంగా రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ వింగ్ ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి జైపూర్ పరిధిలోని కీలక ప్రాంతాలను జల్లెడ పట్టాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, హోటళ్లు, అనుమానాస్పదంగా ఉన్న పాన్ షాపుల్లో అణువణువూ ఆకస్మిక దాడులు నిర్వహించి క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు.


​సమాజానికి ముప్పుగా మారిన నిషేధిత వస్తువులు, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తును, ముఖ్యంగా యువతను మత్తు రక్కసి బారి నుండి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇటువంటి ఆకస్మిక తనిఖీలు రాబోయే రోజుల్లోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రజలు, యువత కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు