BREAKING
మెదక్ జిల్లాలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ ఏడీఈ అరెస్ట్ ​బెల్లంపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ ​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి కులగణనపై సుప్రీంకోర్టు తీర్పుకు బీసీ సమాజ్ హర్షం.. కేంద్రానికి కీలక డిమాండ్ పుంగనూరు, మండలంలో ఉపాధ్యాయురాలు శాశ్వతంగా తొలగింపు... విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం మెదక్ జిల్లాలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ ఏడీఈ అరెస్ట్ ​బెల్లంపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ ​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి కులగణనపై సుప్రీంకోర్టు తీర్పుకు బీసీ సమాజ్ హర్షం.. కేంద్రానికి కీలక డిమాండ్ పుంగనూరు, మండలంలో ఉపాధ్యాయురాలు శాశ్వతంగా తొలగింపు... విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం
www.ntodaynews.com

​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 May, 2026 - 03:04 PM
15 వీక్షణలు

​కమిషనరేట్ ఆదేశాలతో ముమ్మర సోదాలు

​జైపూర్ పరిధిలో రంగంలోకి స్పెషల్ వింగ్స్

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ పరిధిలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి మహమ్మారిని రూపుమాపడమే ధ్యేయంగా రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ వింగ్ ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి జైపూర్ పరిధిలోని కీలక ప్రాంతాలను జల్లెడ పట్టాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, హోటళ్లు, అనుమానాస్పదంగా ఉన్న పాన్ షాపుల్లో అణువణువూ ఆకస్మిక దాడులు నిర్వహించి క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు.


​సమాజానికి ముప్పుగా మారిన నిషేధిత వస్తువులు, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తును, ముఖ్యంగా యువతను మత్తు రక్కసి బారి నుండి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇటువంటి ఆకస్మిక తనిఖీలు రాబోయే రోజుల్లోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రజలు, యువత కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు