BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​గంజాయి నియంత్రణకు జైపూర్‌లో పోలీసుల మెరుపుదాడి

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 03:04 PM
101 వీక్షణలు

​కమిషనరేట్ ఆదేశాలతో ముమ్మర సోదాలు

​జైపూర్ పరిధిలో రంగంలోకి స్పెషల్ వింగ్స్

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ పరిధిలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి మహమ్మారిని రూపుమాపడమే ధ్యేయంగా రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ వింగ్ ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి జైపూర్ పరిధిలోని కీలక ప్రాంతాలను జల్లెడ పట్టాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, హోటళ్లు, అనుమానాస్పదంగా ఉన్న పాన్ షాపుల్లో అణువణువూ ఆకస్మిక దాడులు నిర్వహించి క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు.


​సమాజానికి ముప్పుగా మారిన నిషేధిత వస్తువులు, మత్తు పదార్థాలను విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తును, ముఖ్యంగా యువతను మత్తు రక్కసి బారి నుండి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇటువంటి ఆకస్మిక తనిఖీలు రాబోయే రోజుల్లోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రజలు, యువత కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు