గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం
గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం.
తక్షణమే స్పందించి వాటర్ ట్యాంకర్తో మంటలు ఆర్పించిన గంగా శ్రీనివాసరావు
చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామ శివారులోని శివాలయం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గణపవరం గ్రామ టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ టీడీపీ పక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన గంగా శ్రీనివాసరావు తన స్వంత వాటర్ ట్యాంకర్ను సంఘటన స్థలానికి తీసుకువచ్చి, అక్కడే ఉండి మంటలను అదుపులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.
ఈ సందర్భంగా స్థానికులు గంగా శ్రీనివాసరావు తక్షణ స్పందనను అభినందించారు. కాగా, డంపింగ్ యార్డులో మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆకతాయిల చర్యల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.