BREAKING
రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
www.ntodaynews.com

గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
06 Jun, 2026 - 01:43 PM
9 వీక్షణలు

గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం.

తక్షణమే స్పందించి వాటర్ ట్యాంకర్‌తో మంటలు ఆర్పించిన గంగా శ్రీనివాసరావు

చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామ శివారులోని శివాలయం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గణపవరం గ్రామ టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ టీడీపీ పక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన గంగా శ్రీనివాసరావు తన స్వంత వాటర్ ట్యాంకర్‌ను సంఘటన స్థలానికి తీసుకువచ్చి, అక్కడే ఉండి మంటలను అదుపులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.

ఈ సందర్భంగా స్థానికులు గంగా శ్రీనివాసరావు తక్షణ స్పందనను అభినందించారు. కాగా, డంపింగ్ యార్డులో మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆకతాయిల చర్యల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.