గొల్లప్రోలులో ఘనంగా మేడే వేడుకలు.
గొల్లప్రోలులో ఘనంగా మేడే వేడుకలు.
శ్రమజీవుల కు స్ఫూర్తి మే డే కార్మికుల జీవితాలలో చంద్రోదయం మేడే
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసిన (కడారి తమ్మయ్య నాయుడు)
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ & యూనియన్ అనిశెట్టి నూకరాజు ఏఐటీయూసీ సభ్యులు కేశవరపు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన మేడే కార్యక్రమం లో జనసేన సీనియర్ నాయకులు కడారి తమ్మయ్య నాయుడు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అనంతరం యూనియన్ ఆఫీస్ నుండి ర్యాలీ గా బయలుదేరారు .కార్మిక ల ఐక్యత వర్ధిల్లాలి అంటు శ్లోకాలతో మేడే గొల్లప్రోలు ఎర్ర జండా లతో నిండింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా
మేడే సంబరాలు
మే డే ఉత్సవాలు ఘనంగా జరిగా యని.. అంతర్జాతీయం గా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిందని దీనికి వ్యతిరేకం గా పోరాడాలని కోరారు. అలాగే ఖనిజ సంపదతో సహా దేశంలోని ప్రభుత్వ ఆస్తులు దేశ విదేశి కార్పొరేట్ సంస్థలకు ధారాధ దర్శనం చేయడానికి దేశ ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ బానిస బ్రతుకులకు అంతిమగీతం పాడిన రోజు మే డే అని, కష్టజీవుల ఐక్యత ముందు దోపిడీమూకలు ఓడిన రోజు మేడే అని, ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు మేడే అని, హక్కులని పోరాటం ద్వారా దక్కుతాయని గొంతెత్తి చాటిన రోజు మే డే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్ మోకిరెడ్డి గంగబాబు చేదు లూరి రత్నాజీ ఎరుకం లోవ రాజు సిద్ధ లవ కుశ కోల వీరబాబు మొగలి ప్రసాద్ కార్మికులు పాల్గొన్నారు.