www.ntodaynews.com
గోదావరి పుష్కరాల రోడ్ల అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్
/
తూర్పు గోదావరి
గోదావరి పుష్కరాల రోడ్ల అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరు
రాజమహేంద్రవరం :
గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ నిధులను కేటాయించారు.
మొత్తం 111 రహదారి అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.