BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

గూడెం ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 07:25 PM
141 వీక్షణలు

మంచిర్యాల,జూన్13: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గూడెం ఆలయ అభివృద్ధికి ప్రజల ఆకాంక్ష మేరకు రూ.70 కోట్ల నిధులు కేటాయించామని, 37 రోజుల్లోనే పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాల కోసం ఘాట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.రైతు సంక్షేమంలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో రూ.74 కోట్ల అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమిపూజ చేసినట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో సాగు అభివృద్ధి చెందుతోందని, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు