BREAKING
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.
www.ntodaynews.com

​ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 09:57 PM
14 వీక్షణలు

మంచిర్యాలలో శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన

ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఇతర నిర్మాణాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కమిషనర్ అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య తదితరులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి రూ. 2 వేల 216 కోట్లతో చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాబోవు గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 1 వేయి కోట్లు కేటాయించిందని, ఇందులో భాగంగా మంజూరైన రూ. 3 కోట్ల గోదావరి పుష్కరాల అంచనా నిధులతో శ్రీ విశ్వనాథ ఆలయ పునఃనిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో రూ. 1 కోటి 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న డివిజనల్ కార్యాలయాల భవన నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు