www.ntodaynews.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్’ నయా రాజకీయ పార్టీ..
తెలంగాణ
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే ప్రయత్నాల్లో భాగంగా ఈ పార్టీ రేపు హైదరాబాద్లో భారీ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధాన ఆకర్షణగా విద్యాశాఖపై చేసిన విమర్శలు, అలాగే విద్యామంత్రి రాజీనామా డిమాండ్ నిలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పరిస్థితిలో, సభలో నేరుగా విద్యామంత్రి రాజీనామా డిమాండ్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక మరోవైపు, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ కూడా ఈ పార్టీ ముందుకు తీసుకువస్తోంది. అయితే ఈ నినాదాలు కామన్ అజెండా కింద అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయా, లేక తెలంగాణకు ప్రత్యేకంగా రూపొందించారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
సభ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.