గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటారు
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ పథం” కార్యక్రమాన్ని చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి-పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని అన్నారు.
స్వచ్చంద్ర కార్పొరేషన్ వారి స్వచ్చ రధాన్ని ప్రారంభించారు,
మండలంలోని క్లాప్ మిత్రా లను ఒకచోట సమీకరించి, ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.
అలాగే గ్రామాల్లో మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం వంటి అంశాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు,కార్యకర్తలు,పాల్గొన్నారు