BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటారు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 04:53 PM
31 వీక్షణలు

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ 

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే  సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ పథం” కార్యక్రమాన్ని చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి-పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని అన్నారు.

స్వచ్చంద్ర కార్పొరేషన్ వారి స్వచ్చ రధాన్ని ప్రారంభించారు,

మండలంలోని క్లాప్ మిత్రా లను ఒకచోట సమీకరించి, ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

అలాగే గ్రామాల్లో మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం వంటి అంశాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు,కార్యకర్తలు,పాల్గొన్నారు